
‘కలర్స్’ స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని ఆమె వివాహం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా ఫొటోలతో పంచుకున్న ఈ జంట పెళ్లిని అధికారికంగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో స్వాతి దంపతులకు ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో 2023లో విడుదలైన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో స్వాతి కథానాయికగా నటించారు. కొంత విరామం తర్వాత ఆమె నటించిన ఈ చిత్రం, ముఖ్యంగా ఓటీటీ వేదికగా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, వైవాహిక బంధానికి దారితీసిందని తెలుస్తోంది.
