కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన సతీమణి ఆర్తిల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. పిల్లల పోషణ, స్కూల్ ఫీజుల చెల్లింపు విషయంలో వీరి మధ్య ఉన్న వివాదంపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
2025 ఏప్రిల్ నుంచి జయం రవి తన పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆర్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనివల్ల పిల్లల చదువుకు, రోజువారీ అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అత్యవసర పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. రెండు వారాల్లోగా మధ్యంతర భరణం పిటిషన్పై విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మొత్తంగా జయం రవి -ఆర్తి విడాకుల వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో మళ్లీ ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు అభిమానులు, ఇటు కోలీవుడ్ ఆసక్తిగా గమనిస్తోంది.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…