
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన సతీమణి ఆర్తిల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. పిల్లల పోషణ, స్కూల్ ఫీజుల చెల్లింపు విషయంలో వీరి మధ్య ఉన్న వివాదంపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
2025 ఏప్రిల్ నుంచి జయం రవి తన పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆర్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనివల్ల పిల్లల చదువుకు, రోజువారీ అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అత్యవసర పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. రెండు వారాల్లోగా మధ్యంతర భరణం పిటిషన్పై విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మొత్తంగా జయం రవి -ఆర్తి విడాకుల వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో మళ్లీ ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు అభిమానులు, ఇటు కోలీవుడ్ ఆసక్తిగా గమనిస్తోంది.

