టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత 2’ కు నిర్మాతగా వ్యవహారించనున్నారు.ఈ సిరీస్తో తాను నిర్మాతగా మారుతున్న విషయాన్ని నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “దూత రెండో అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో పాటు నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను. ఈ శుభారంభం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముందుకు సాగడమే. అద్భుతాలు జరగబోతున్నాయి” అంటూ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే అంచనా వేస్తున్న న్యూస్పేపర్ల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో ఆయన నటన ప్రతిఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ రెండో భాగం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్, అక్కినేని నాగార్జున హాజరయ్యారు.ఈ సందర్భంగా తొలి షాట్కు క్లాప్ కొట్టిన ఆయన యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…