
రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ (ఆన్ లైన్ ద్వారా) హాజరయ్యారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
“సర్”లో పాల్గొన్న లోకేష్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఉండవల్లి లోని తమ నివాసానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ అడిగిన సమాచారం, డాక్యుమెంట్లను మంత్రి లోకేష్ సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
