Find Articles

అమరావతి నిర్మాణాల ఖర్చుపై జగన్ సంచలన ఆరోపణలు

అమరావతి నిర్మాణాల ఖర్చుపై జగన్ సంచలన ఆరోపణలు

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ చంద్రబాబు చేస్తున్న నిర్మాణాలకు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.20,427. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కట్టినా ఇంత ఖర్చు అవ్వదు. కేంద్రం నిర్మించే నేషనల్ హైవేలకు కి.మీకు అయ్యే ఖర్చు 24కోట్లు అవుతుంటే, అమరావతిలో కి.మీ 53 కోట్లు. ఇవన్నీ బయటకు రాకూడదనే ఈ దాడులు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి పతనం ఖాయం అని తెలిశాక ‘SIR’ను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్ సీపీకి చెందిన ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారు. మీకు ఓటేయలేదని ఓటర్ల గుర్తింపే తీసేస్తే వాళ్లు ఏ దేశ పౌరులు అవుతారు? వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమవుతాయి? దళితులు మతం మారడం వల్ల వారి ఆర్థికస్థితి మారిపోదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

 

ManaTV Team