
మంగళగిరిలో పవన్ కళ్యాణ్ను కలిసిన రామ్ చరణ్
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్లను వీక్షించేందుకు అమరావతిలోని ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి వెళ్లే ముందు రామ్ చరణ్ జనసేన కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.రామ్ చరణ్ రాకతో జనసేన కార్యాలయం వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అనంతరం ఆయన అమరావతికి బయలుదేరి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
