Find Articles

మిచిగన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC USA) కొత్త చాప్టర్ ప్రారంభం

మిచిగన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC USA) కొత్త చాప్టర్ ప్రారంభం

భారతీయ రాజకీయ, సామాజిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ (IOC USA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ మిచిగన్ చాప్టర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతదేశం మరియు అమెరికా నుంచి పలువురు ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ గ్రాండ్ లాంచ్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ గ్లోబల్ చైర్మన్ సామ్ పిత్రోడా,, ఐఓసీ యూఎస్ఏ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, అలాగే ఐఓసీ యూఎస్ఏ నార్త్ ఈస్ట్ రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సామల తదితరులు లు తమ సందేశాలను అందించారు. అమెరికాలోని భారతీయుల సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, భారత్-అమెరికా సంబంధాల బలోపేతం వంటి లక్ష్యాలతో ఈ మిచిగన్ చాప్టర్ పనిచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “Building Bridges… Empowering Communities” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీధర్ పటేల్ మరియు ఆయన బృందం అత్యంత విజయవంతంగా నిర్వహించారు.

 

ManaTV Team