
తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను జులైలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జన నాయకన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. గతేడాది డిసెంబర్లో సెన్సార్కు పంపిన చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

