మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఇరు జట్ల క్రీడాకారిణుల మధ్య మైదానంలో గొడవ జరిగినట్లు ఉన్నట్లు ఉన్న ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఎలాంటి వాస్తవం లేదని తేలింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో పిచ్ మధ్యలో ఒక పాకిస్థాన్ ప్లేయర్, భారత బ్యాటర్పై దాడికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అంపైర్లు, ఇతర క్రీడాకారిణులు జోక్యం చేసుకుని వాళ్లను విడదీస్తున్నట్లు ఉంది. ఇక, ఈ వీడియో చూసిన అభిమానులు తీవ్రంగా స్పందించారు. కొందరు ఇది నిజంగా జరిగిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్ధమని వ్యాఖ్యానించారు. అయితే నిజానికి బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేలింది. మ్యాచ్ మొత్తం ప్రశాంత వాతావరణంలో, క్రీడాస్ఫూర్తితోనే సాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ నకిలీ వీడియోను సృష్టించి ఉంటారని తెలుస్తోంది.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…