Find Articles

భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ?.. అస‌లు నిజం ఇదే!

భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ?.. అస‌లు నిజం ఇదే!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఇరు జట్ల క్రీడాకారిణుల మధ్య మైదానంలో గొడవ జరిగినట్లు ఉన్నట్లు ఉన్న ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఎలాంటి వాస్తవం లేదని తేలింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో పిచ్ మధ్యలో ఒక పాకిస్థాన్ ప్లేయర్, భారత బ్యాటర్‌పై దాడికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అంపైర్లు, ఇతర క్రీడాకారిణులు జోక్యం చేసుకుని వాళ్లను విడదీస్తున్నట్లు ఉంది. ఇక‌, ఈ వీడియో చూసిన అభిమానులు తీవ్రంగా స్పందించారు. కొందరు ఇది నిజంగా జరిగిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్ధమని వ్యాఖ్యానించారు. అయితే నిజానికి బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేలింది. మ్యాచ్ మొత్తం ప్రశాంత వాతావరణంలో, క్రీడాస్ఫూర్తితోనే సాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ నకిలీ వీడియోను సృష్టించి ఉంటారని తెలుస్తోంది.

ManaTV Team