భారతీయ రాజకీయ, సామాజిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ (IOC USA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ మిచిగన్ చాప్టర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతదేశం మరియు అమెరికా నుంచి పలువురు ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ గ్రాండ్ లాంచ్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ గ్లోబల్ చైర్మన్ సామ్ పిత్రోడా,, ఐఓసీ యూఎస్ఏ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, అలాగే ఐఓసీ యూఎస్ఏ నార్త్ ఈస్ట్ రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సామల తదితరులు లు తమ సందేశాలను అందించారు. అమెరికాలోని భారతీయుల సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, భారత్-అమెరికా సంబంధాల బలోపేతం వంటి లక్ష్యాలతో ఈ మిచిగన్ చాప్టర్ పనిచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “Building Bridges… Empowering Communities” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీధర్ పటేల్ మరియు ఆయన బృందం అత్యంత విజయవంతంగా నిర్వహించారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…
న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి…
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన…
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా…