‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆర్డర్ మార్చి తెచ్చాడనే కారణంతో ఓ డెలివరీ బాయ్ పై దాడి చేశాడని వార్తలు వచ్చాయి. కొండాపూర్ లో అఖిల్ రాజ్ ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ ఘటనను బాధితుడు తన ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పొరపాటును ఒప్పుకుని క్షమాపణలు కోరినప్పటికీ, అఖిల్ రాజ్ తనపై దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా హీరో తల్లి తన మొహంపై ఉమ్మేసిందని వాపోయారు. దీంతో నెటిజన్లు అఖిల్ రాజ్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అఖిల్ రాజ్ స్పందించారు.
ఎవరికో ఇవ్వాల్సిన ఆర్డర్ ను ఆ డెలివరీ బాయ్ తప్పుగా తన ఇంట్లో ఇచ్చాడని అఖిల్ రాజ్ తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగొచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని చెప్పారు. మద్యం మత్తులో ఉన్నాడని, అడ్రెస్ క్రాస్ చెక్ చేసుకోలేదా అని అడిగితే దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా, తన తల్లిని కూడా దుర్భాషలాడాడని చెప్పారు. అతన్ని కొట్టలేదని, అమ్మని తిట్టాడనే కోపంలో తిరిగి తిట్టానని వివరణ ఇచ్చారు అఖిల్ రాజ్. తాను తప్పు చేస్తే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటూ అఖిల్ ఓ వీడియో షేర్ చేశారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…
న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి…
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన…
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా…