టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్పై విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్డాగ్-33‘. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.అయితే, తాజాగా పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
“ప్రతి ఒక్కరూ దొంగే.. ఇక్కడ మంచివాళ్లకు అస్సలు చోటు లేదు” అంటూ పూరీ తన పోస్ట్లో రాసుకొచ్చారు.దీనికి తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను కూడా జోడించారు. దీంతో పూరీని ఇంతలా బాధపెట్టిన ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ సినిమాల డిస్ట్రిబ్యూటర్లతో ఉన్న ఆర్థిక వివాదాల వల్లే పూరీ ఇలా స్పందించారా? లేక ఏదైనా వ్యక్తిగత మోసం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పూరీ జగన్నాథ్ ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన పెట్టిన పోస్ట్ వెనుక బలమైన కారణమే ఉంటుందని భావిస్తున్నారు.దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…