పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘ స్పిరిట్’. ఈ సినిమా షూటింగ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, షూటింగ్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ హాట్ టాపిక్ గా మారుతోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ లో సీనియర్ నటి నదియా పాల్గొన్నారని తెలుస్తోంది. గతంలో మిర్చి సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించిన ఆమె, దాదాపు 14 సంవత్సరాల తరువాత ఆయనతో కలిసి నటించనున్నారు. మిర్చిలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కనిపించనుండటంతో ప్రాజెక్టుపై ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబేరాయ్ విలన్ గా కనించనున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…