Find Articles

వైభవ్‌ సూర్యవంశీపై ప్రతీకారం.. శ్రీలంక కెప్టెన్‌ ఏం చెప్పారంటే.?

వైభవ్‌ సూర్యవంశీపై ప్రతీకారం.. శ్రీలంక కెప్టెన్‌ ఏం చెప్పారంటే.?

ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య గత మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ సందర్భంగా జరిగిన వివాదం తెలిసిందే. దీంతో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీని శ్రీలంక ప్లేయర్స్ లక్ష్యంగా చేసుకుంటారనే చర్చ జోరందుకుంది. అయితే అలాంటి ఉద్దేశం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్‌ సహన్‌ అరచ్చిగే తెలిపారు.

గత మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ సందర్భంగా ప్లేయర్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరపడగా.. వైభవ్ సూర్యవంశీ తన టీమ్ కు విజయాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే విషెన్‌ హలంబగేను తోసేశారు. దీంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే ఆ ఘటనను పెద్దగా చూడాల్సిన అవసరం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్‌ సహన్‌ అరచ్చిగే తెలిపారు. సూపర్‌ ఓవర్‌లాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో భావోద్వేగాలు బయటపడటం సహజమని పేర్కొన్నారు. తమ ప్లేయర్స్ ఎవరినీ టార్గెట్‌ చేయడం లేదని చెప్పారు. ఆటపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టామని తెలిపారు. ఫైనల్‌కు పూర్తిగా రెడీగా ఉన్నామని వెల్లడించారు.

ManaTV Team