
ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య గత మ్యాచ్లో సూపర్ ఓవర్ సందర్భంగా జరిగిన వివాదం తెలిసిందే. దీంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ప్లేయర్స్ లక్ష్యంగా చేసుకుంటారనే చర్చ జోరందుకుంది. అయితే అలాంటి ఉద్దేశం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపారు.
గత మ్యాచ్లో సూపర్ ఓవర్ సందర్భంగా ప్లేయర్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరపడగా.. వైభవ్ సూర్యవంశీ తన టీమ్ కు విజయాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే విషెన్ హలంబగేను తోసేశారు. దీంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఆ ఘటనను పెద్దగా చూడాల్సిన అవసరం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపారు. సూపర్ ఓవర్లాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో భావోద్వేగాలు బయటపడటం సహజమని పేర్కొన్నారు. తమ ప్లేయర్స్ ఎవరినీ టార్గెట్ చేయడం లేదని చెప్పారు. ఆటపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టామని తెలిపారు. ఫైనల్కు పూర్తిగా రెడీగా ఉన్నామని వెల్లడించారు.

