
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన Sri Sathya Sai Vidya Vihar విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంగీతం, నృత్యం, నాటికల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతి, మానవ విలువలు, సేవా భావం, ఆధ్యాత్మికత వంటి అంశాలను విద్యార్థులు హృద్యంగా ఆవిష్కరించారు. వారి ప్రదర్శనలో కళాత్మకతతో పాటు విలువల ఆధారిత విద్యకు ప్రతిబింబంగా నిలిచే సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.

