
చెన్నై: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహించిన ‘స్టార్ట్ రన్.. స్టాప్ డ్రగ్స్’ (Start Run, Stop Drugs) మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జోసఫ్ విజయ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, యువత, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

