Find Articles

తమిళనాడులో జాతీయ పోలియో చుక్కల మందు శిబిరాన్ని ప్రారంభించిన సీఎం జోసఫ్ విజయ్

తమిళనాడులో జాతీయ పోలియో చుక్కల మందు శిబిరాన్ని ప్రారంభించిన సీఎం జోసఫ్ విజయ్

చెన్నై, జూన్ 28: cm సి. జోసఫ్ విజయ్ ఆదివారం జాతీయ పోలియో చుక్కల మందు ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు అందించారు. వైద్యం మరియు ప్రజా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలోని పాలవాక్కం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ పోలియో చుక్కల మందు ప్రత్యేక శిబిరంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు బొమ్మలు అందజేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. పిల్లలను పోలియో వ్యాధి నుంచి పూర్తిగా రక్షించేందుకు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ManaTV Team