
సీషెల్స్ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో కలిసి సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లోని జెయింట్ టార్టాయిస్ (ఆల్డాబ్రా భారీ తాబేళ్లు) ఎన్క్లోజర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అరుదైన జీవవైవిధ్యాన్ని వీక్షిస్తూ, భారత్–సీషెల్స్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యధిక కాలం జీవించే తాబేళ్ల జాతుల్లో ఆల్డాబ్రా జెయింట్ టార్టాయిస్ ఒకటి. ఇవి సీషెల్స్కు చెందిన స్థానిక జాతి. కొన్ని తాబేళ్లు 200 సంవత్సరాలకు పైగా జీవించి, రెండు శతాబ్దాల చరిత్రకు సాక్షులుగా నిలిచాయి. ఈ తాబేళ్లకు భారత్తో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. 2014లో సీషెల్స్ ప్రభుత్వం రెండు ఆల్డాబ్రా తాబేళ్లను కోల్కతాలోని అలీపూర్ జూకు బహుమతిగా అందించింది. అనంతరం మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూకు కూడా బహూకరించింది. ఈ చర్యలు భారత్–సీషెల్స్ మధ్య స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలిచాయి.

