Categories: Sports

టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక

టీమిండియాకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు దూరమయ్యారు. దీంతో ఆయన స్థానంలో ముంబై యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు మొదటిసారి సీనియర్ టీమ్ లో చోటు కల్పించినట్లు బీసీసీఐ తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం నితీశ్ ఎడమ తొడ కండరాల సమస్యతో బాధపడ్డారు.అతడికి కొంతకాలం విశ్రాంతి, పునరావాసం అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే రెండు టీ20 సిరీస్‌ల నుంచి అతడిని తప్పించారు.ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో, నితీశ్ రెడ్డి జట్టులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతా భావించారు.ముఖ్యంగా బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా అతడు టీమ్ కు బ్యాలెన్స్‌ తీసుకొచ్చే ప్లేయర్ గా గుర్తింపు పొందారు. కానీ గాయం కారణంగా అతను కూడా టూర్‌కు దూరం కావడం నిరాశ కలిగించింది.

ఇక సూర్యాంశ్ షెడ్గే ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున ఆకట్టుకున్నారు. ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేయడంతో పాటు బంతితో కూడా రెండు వికెట్లు సాధించారు.అంతేకాదు 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో 251.92 స్ట్రైక్‌రేట్‌తో 131 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.కుడిచేతి బ్యాటర్, మీడియం పేస్ బౌలర్ అయిన షెడ్గే క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరుగులు చేయగల ప్లేయర్ గా గుర్తింపు పొందారు.ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపికయ్యారు.

ManaTV Team

Recent Posts

UKలో ఆవిష్కరించిన ‘1 మిలియన్ ఫాలోవర్స్’ నవల.. స్నేహా రెడ్డి కొనకటి ఎమోషనల్ పోస్ట్

UK లో నివసిస్తున్న తెలుగు రచయిత్రి స్నేహా రెడ్డి కొనకటి తన చిరకాల కల అయిన "1 మిలియన్ ఫాలోవర్స్"…

4 hours ago

ATA మహాసభలకు మేరీల్యాండ్ గవర్నర్, మేరీల్యాండ్–వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్స్

అమెరికా తెలుగు సంఘం (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. ఈ మహాసభలకు…

4 hours ago

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్ పై కాసుల వర్షం.. టీమిండియాకు ఎంతంటే.?

విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలుచుకున్న వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం…

6 hours ago

పాలిటిక్స్ లోకి ధనుష్.? వైరల్ గా ఫ్యాన్స్ క్లబ్ జెండా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆయన కొత్త సినిమా కాదు.. ఆయన…

6 hours ago

క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్!! అడివి శేష్ బాలీవుడ్ ఎంట్రీ?..

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ త్వరలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో…

7 hours ago

ఏనుగు దంతాల కేసులో కీలక పరిణామం.. మోహన్ లాల్ ప్రకటన

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కీలక వివరాలను ప్రకటించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలతో…

8 hours ago