కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్–2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బిజెపి ఆలోచనా విధానానికి మూలమని పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని, సేవా భావంతో పని చేస్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత, ప్రజాసేవే కార్యకర్తలకు ప్రధాన ఆయుధాలని తెలిపారు.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…