Categories: Movie News

సర్కస్ లా మారిన అంత్యక్రియలు.. రాధికా శరత్ కుమార్ ఆవేదన

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ అంత్యక్రియల సందర్భంగా ఎదురైన పరిస్థితులపై నటి రాధికా శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్పోయిన మనవారిని చివరిసారి చూసే క్షణాలు జీవితంలో ఎంతో భావోద్వేగంగా ఉంటాయి. అలాంటి సమయంలో ప్రశాంత వాతావరణం ఉండాల్సిందిపోయి గందరగోళం నెలకొనడం బాధాకరమని వాపోయారు.

భాగ్యరాజ్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన వారి రద్దీతో అంత్యక్రియల వాతావరణం మారిపోయింది. దీంతో రాధికా శరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల ప్రదేశం సర్కస్ లా మారిపోయిందన్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి ఎప్పుడు వచ్చిందో అర్థం కావడం లేదన్న ఆమె, కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాధను పంచుకునే సమయంలో వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. అంత్యక్రియల సమయంలో జనసమూహం, మీడియా నిర్వహణకు స్పష్టమైన ప్రొటోకాల్ రూపొందించాలని సూచించారు.

భాగ్యరాజ్ మృతిపై రాధిక సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. 50 ఏళ్ల ప్రత్యేక స్నేహానికి ఇదే చివరి వీడ్కోలు అని చెప్పారు. భాగ్యరాజ్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.

ManaTV Team

Recent Posts

‘జననాయగన్’ రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌?.. జులైలోనే విడుదల!

తమిళనాడు సీఎం విజయ్‌ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల…

1 hour ago

రేపే ‘నాగబంధం’ రిలీజ్… ప్రారంభమైన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్

భారీ అంచనాల నడుమ రాబోతున్న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…

3 hours ago

స్టార్ హీరో సూర్య పొలిటికల్ ఎంట్రీ.?

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరోసారి చర్చకు దారితీసింది. నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీతో విజయవంతం కావడంతో ఇతర…

5 hours ago

వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం..?

ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనూ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ…

7 hours ago

అమరావతి నిర్మాణాల ఖర్చుపై జగన్ సంచలన ఆరోపణలు

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…

21 hours ago

Pawan Kalyan: ‘భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే దూషించే హక్కు కాదు’

వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…

21 hours ago