అమెరికాలోని మసాచుసెట్స్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ బోస్టన్ చాప్టర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ హాజరై కాంగ్రెస్ నాయకులు, తెలుగు మరియు భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ మాతృభూమిపై భారతీయులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తోందని, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, విదేశాల్లో సంపాదించిన అనుభవం, నైపుణ్యంతో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, IOC ద్వారా సమర్థవంతమైన నాయకులను తయారు చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు
కర్మను వదలకండి! జీవిత సత్యం చెప్పిన శ్రీకృష్ణుడు ,భగవద్గీత 3వ శ్లోకం #BhagavadGita #manatvlive #BhagavadGita #BhagavadGitaTelugu #GitaSlokam #GitaSlokalu…
Gold Rate Today : 24K & 22K Prices Sep 7-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 07-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…
ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…
టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నది.. నమ్చా బర్వా పర్వత ప్రాంతంలోకి చేరుకున్నప్పుడు దిశ, ప్రవాహ స్వభావంలో కీలక…