సోషల్ మీడియాలో రోజురోజుకు పెరుగుతున్న ద్వేషపూరిత వ్యాఖ్యలపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్’ వేదికను పూర్తిగా వీడుతున్నట్లు ప్రకటించారు.
ఇటీవల పూణెలో కేతన్ అగర్వాల్ హత్య చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది.ఈ నేపథ్యంలోనే రాహుల్ను ట్యాగ్ చేసిన ఓ నెటిజన్, మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో రాహుల్ రవీంద్రన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, ఆయన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తన చిన్న పిల్లలను కూడా చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ‘ఎక్స్’ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ రవీంద్రన్ తెలిపారు.చాలాకాలంగా ఆ వేదిక నుంచి బయటకు రావాలనుకున్నానని, కానీ క్రీడా వార్తల కోసం కొనసాగానని వివరించారు.
ఇంగ్లాండ్తో తొలి టీ20లోనూ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ…
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…
న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి…
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన…