కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. ముఖ్యంగా విదేశాల్లో నివసించే భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు స్వదేశానికి వస్తుంటారు. అలాంటి ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు నెల రోజుల గడువుతో ఉన్న ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని మూడు నెలలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల విదేశీ భక్తులకు మరింత సౌలభ్యం కలగనుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ మరో కీలక ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన 30 రోజుల లోపే ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందాల్సి ఉండగా… తాజాగా ఆ గడువును 90 రోజులకు పెంచింది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ భక్తులు తమ ఒరిజినల్ పాస్పోర్ట్, సంబంధిత పత్రాలతో తిరుమలలోని సుపథం ప్రవేశ కేంద్రానికి వెళ్లి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ పొందేవారు. అయితే నెల రోజుల గడువు కారణంగా చాలామంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. దీంతో భక్తుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును మూడు నెలలకు పెంచింది.ఈ నిర్ణయంతో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది.భక్తుల సౌకర్యం, సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశ విదేశాల భక్తులకు మరింత చేరువవుతున్నాయి.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…