Find Articles

NRI భక్తులకు టీటీడీ శుభవార్త శ్రీవారి దర్శన గడువుపెంపు

NRI భక్తులకు టీటీడీ శుభవార్త శ్రీవారి దర్శన గడువుపెంపు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. ముఖ్యంగా విదేశాల్లో నివసించే భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు స్వదేశానికి వస్తుంటారు. అలాంటి ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు నెల రోజుల గడువుతో ఉన్న ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని మూడు నెలలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల విదేశీ భక్తులకు మరింత సౌలభ్యం కలగనుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ మరో కీలక ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన 30 రోజుల లోపే ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందాల్సి ఉండగా… తాజాగా ఆ గడువును 90 రోజులకు పెంచింది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ భక్తులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, సంబంధిత పత్రాలతో తిరుమలలోని సుపథం ప్రవేశ కేంద్రానికి వెళ్లి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ పొందేవారు. అయితే నెల రోజుల గడువు కారణంగా చాలామంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. దీంతో భక్తుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును మూడు నెలలకు పెంచింది.ఈ నిర్ణయంతో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది.భక్తుల సౌకర్యం, సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశ విదేశాల భక్తులకు మరింత చేరువవుతున్నాయి.

ManaTV Team