తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఈ నెల 23న విడుదల కానుందంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.
సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను వీక్షించి కొన్ని సవరణలు సూచించారని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ మార్పులు చేసే పనిలో బృందం బిజీగా ఉందని నిర్మాతలు తెలిపారు.ఈ వర్క్ పూర్తి కాగానే రీ-సెన్సార్ కోసం బోర్డుకు పంపుతామన్నారు.అన్ని సాంకేతిక పనులు త్వరగా పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంలోనే అభిమానులు ఎవరూ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, అధికారిక అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాలని కోరారు.కాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…
UK లో నివసిస్తున్న తెలుగు రచయిత్రి స్నేహా రెడ్డి కొనకటి తన చిరకాల కల అయిన "1 మిలియన్ ఫాలోవర్స్"…