Find Articles

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఈ నెల 23న విడుదల కానుందంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను వీక్షించి కొన్ని సవరణలు సూచించారని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ మార్పులు చేసే పనిలో బృందం బిజీగా ఉందని నిర్మాతలు తెలిపారు.ఈ వర్క్ పూర్తి కాగానే రీ-సెన్సార్ కోసం బోర్డుకు పంపుతామన్నారు.అన్ని సాంకేతిక పనులు త్వరగా పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంలోనే అభిమానులు ఎవరూ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, అధికారిక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాలని కోరారు.కాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.

ManaTV Team