తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్ద ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు అలాగే బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేసింది.
రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్ లకు సమీపంలో నడిచే మద్యం షాపులన్నీ రెండు వారాల్లోగా మూసివేయాలని విజయ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా TASMAC ఆధ్వర్యంలో మొత్తం 4,765 మద్యం రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. వాటిలో 717 దుకాణాలను మూసివేయనుంది. ఇందులో 276 మద్యం షాపులు ప్రార్థనా మందిరాలకు సమీపంలోనే ఉండగా.. మరో 186 విద్యాసంస్థలు, 255 బస్స్టాండ్లకు దగ్గరలో ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…