ప్రముఖ యువ నటి ప్రియాంక అరుళ్ మోహన్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆమెను దక్షిణ కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా నియమిస్తున్నట్లు కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ అధికారికంగా ప్రకటించాయి.
ఇటీవలే ప్రియాంక అరుళ్ మోహన్ ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ విశేష గౌరవం దక్కడం విశేషం.ఈ సినిమా కొరియా నేపథ్యంలో సాగడం, అక్కడి సంస్కృతిని ప్రతిబింబించడంతో ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు.ఈ అరుదైన క్షణాన్ని ప్రియాంక మోహన్ తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇది నాకు దక్కిన అద్భుతమైన గౌరవం. కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా నన్ను నియమించడం ఎంతో ప్రత్యేకం. కొరియా సంస్కృతిని, సంప్రదాయాలను భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసే వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వానికి, పర్యాటక సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు. కొరియా సంస్కృతి, ప్రజల ఆప్యాయత నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ అందమైన ప్రయాణంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను” అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
రా కార్తీక్ డైరెక్షన్ లో వచ్చిన ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నేరుగా ఓటీటీలో రిలీజైంది. దక్షిణ కొరియాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ ద్వారానే ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి అంతర్జాతీయ నటులతో కలిసి పని చేశారు. ఇప్పుడు అదే సినిమా ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకురావడం విశేషం.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…