అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్ లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు.
పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు చోటు చేసుకున్నాయని సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు మస్కటీన్ కు చెందిన ర్యాన్ విల్లీస్ గా గుర్తించారు. అయితే పోలీసుల రాకను గమనించిన విల్లీస్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. మరోవైపు మస్కటీన్ లోని ఓ నివాసంలో, గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…