
– తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం
– పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్
– మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం
తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్లు జరిపిన తాజా చర్చలు సఫలమవడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.ఇరు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి చేసిన కీలక సూచనలతో ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేందుకు అంగీకరించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు ముందుకు సాగాలని సూచించారు.
తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొంతకాలంగా పర్సంటేజీ వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ‘పెద్ది’ చిత్రం నుంచే ఈ పర్సంటేజీ విధానం అమలు కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే చిరుతో సమావేశమైన ఎగ్జిబిటర్లు.. పర్సంటేజీ విధానం నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.దీంతో జూన్ 4వ తేదీన విడుదల కానున్న పెద్ది చిత్రంను రెంటల్ విధానంలోనే ప్రదర్శించనున్నారు.జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.

