
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రారంభించింది. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లోనే దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ సీన్స్ భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ తో ఉండనున్నాయని సమాచారం. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.
1960ల కాలంలో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని కల్పిత గ్రామం నేపథ్యంలో ‘భోగి’ కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్ గంగ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ నటిస్తుండగా, డింపుల్ హయాతి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28న రాఖీ పండుగ సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

