
విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ (Digii100x ANDHRA PRADESH) సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది. సుసంపన్న భవిష్యత్ కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలి. ఏపీలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ తో ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయి. యువతకు అవకాశాల కల్పనలో ఏపీతో భాగస్వాములు కావాలని నారా లోకేష్ కోరారు.
