
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్లు శ్రీనివాస మంగాపురం సినిమాపై అంచనాలను పెంచాయి.
‘RX 100’, ‘మంగళవారం’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా హీరోయిన్గా నటిస్తూ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఓ ఇంటెన్స్ లవ్స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

