
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సేవా దృక్పథంతో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం, ఎడిసన్ నగరంలోని ఎస్డీపీ ఎస్ఎస్వీటీ ఎన్జే (సాయి దత్త పీఠం) ఆలయంలో నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య మరియు ఆరోగ్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరానికి స్థానిక తెలుగు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.అర్హులైన వైద్యులచే ఉచిత ఆరోగ్య పరీక్షలు, ప్రాథమిక వ్యాధి నిర్ధారణ సేవలు అందించారు. అలాగే రోగులకు అవసరమైన వైద్య సలహాలను, సూచనలను నిపుణులు అందజేశారు. ముఖ్యంగా అమెరికాకు వచ్చే విజిటింగ్ పేరెంట్స్ , విద్యార్థులు, మరియు హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. వారు నాట్స్ చేసిన ఈ మేలును ఎంతగానో అభినందించారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మంధాడి నాయకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

