శివ కార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రెమ్యునరేషన్ ఇంకా చెల్లించలేదని డైరెక్టర్ సుధా కొంగర హైకోర్టును ఆశ్రయించారు.
‘పరాశక్తి’ సినిమాని డాన్ పిక్చర్ బ్యానర్ పై రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సుధా కొంగరకు రూ.15 కోట్ల పారితోషికం ఇచ్చేలా మాట్లాడుకున్నారట. జీఎస్టీ కలుపుకొని మొత్తం రూ.17.70 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. అయితే నిర్మాతలు ఇప్పటివరకూ రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగతా రూ.8.39 కోట్లు ఇవ్వడం లేదని సుధా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బకాయిలు చెల్లించే వరకు ‘ఇదయం మురళి’ విడుదలను నిలిపివేయాలని కోరారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రిలీజ్ను జూలై 8 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. అదేవిధంగా ‘ఇదయమ్ మురళి’ సినిమాను నిలిపివేయాలనే సుధా కొంగర విజ్ఞప్తిపై జూలై 7 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డాన్ పిక్చర్స్ యాజమాన్యానికి సూచించింది.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…
న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి…
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన…
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా…