T.T.D బోర్డు సభ్యుడు, తెదేపా సీనియర్ నేత మల్లెల రాజశేఖర్ కి అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రభుత్వ సుపరిపాలన సందర్భంగా ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్లలో విద్య, వైద్యం, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగ, ఉపాధి, మహిళా సాధికార రంగాలలో గణనీయమైన వృద్ధి, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కూటమి ప్రభుత్వం సాగిస్తోంది అని రాజశేఖర్ అన్నారు. అమెరికా సహా పలు దేశాల లోని ఎన్నారైలు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ విజయానికి అండగా నిలిచారని, అమరావతి , ఏపీ ప్రగతి మనందరి సమిష్టి బాధ్యత అని రాజశేఖర్ తెలిపారు. కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవంలో భాగంగా కేకు కట్ చేసి తెదేపా అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమన, సతీష్, చంద్ర , భాను , సుధీర్ , సాయి , రవి తదితరులు పాల్గొన్నారు.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…