Find Articles

NRITDP: అమెరికాలో తెదేపా సంబరాలు

NRITDP: అమెరికాలో తెదేపా సంబరాలు

T.T.D బోర్డు సభ్యుడు, తెదేపా సీనియర్ నేత మల్లెల రాజశేఖర్ కి అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రభుత్వ సుపరిపాలన సందర్భంగా ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్లలో విద్య, వైద్యం, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగ, ఉపాధి, మహిళా సాధికార రంగాలలో గణనీయమైన వృద్ధి, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కూటమి ప్రభుత్వం సాగిస్తోంది అని రాజశేఖర్ అన్నారు. అమెరికా సహా పలు దేశాల లోని ఎన్నారైలు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ విజయానికి అండగా నిలిచారని, అమరావతి , ఏపీ ప్రగతి మనందరి సమిష్టి బాధ్యత అని రాజశేఖర్ తెలిపారు. కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవంలో భాగంగా కేకు కట్ చేసి తెదేపా అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమన, సతీష్, చంద్ర , భాను , సుధీర్ , సాయి , రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

ManaTV Team