గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో మెగా జాతర ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రామ్చరణ్ మేకోవర్, ఆయన నటన, డైలాగ్స్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు ఎంత ఎమోషనల్గా తెరకెక్కించారో ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. చెర్రీ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదగడాన్ని మనం గమనించొచ్చు. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్ ట్రైలర్ను నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లాయి. అలాగే ‘‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను’’ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్కు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది.
మొత్తంగా ‘పెద్ది’ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్న పక్కా పాన్ ఇండియా బ్లాక్బస్టర్ మెటీరియల్లా కనిపిస్తోంది. మరీ ఇన్ని అంచనాలతో జూన్ 4న థియేటర్లలో పెద్ది బాక్సాఫీస్ వేట ఎలా ఉండబోతుందో చూడాలి!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…