
*’హైబ్రిడ్ కాన్ఫరెన్స్’ ఎలా నిర్వహించాలో ప్రపంచానికి ‘మహానాడు’ చేసి చూపిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు
*ఇదో పెద్ద ప్రయోగం.. 1,875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి టీడీపీ శ్రేణులు ఆన్లైన్లో హాజరయ్యారు.
*రికార్డు సృష్టించడం, తిరగరాయడం.. బద్దలుకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం.
*ఆన్లైన్లో దాదాపు 17 లక్షల మంది పాల్గొన్న ఈ ‘వర్చువల్ మహానాడు’ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.
* టీడీపీని శాశ్వతంగా మోసింది.. మోస్తోంది.. మోయబోయేది ‘కార్యకర్తలే’
*టీడీపీ కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చుచేశాం.. ‘మై హెల్త్ టీడీపీ యాప్’ ద్వారా టీడీపీ కుటుంబసభ్యులను ఆదుకుంటాం.
*’స్వర్ణాంధ్ర విజన్-2047′ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.. ‘ఎథికల్, ఎకనమిక్ ఎంపవర్మెంట్’ సాధించడం నా కోరిక.
*విజయాలకు కారణమైన నా టీడీపీ కుటుంబానికి శాశ్వతంగా ఋణపడి ఉంటానని చంద్రబాబు అన్నారు.

