
తమిళనాడు సీఎం విజయ్, సౌత్ క్వీన్ త్రిష మధ్య ఉన్న బంధంపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవల కోలీవుడ్ హీరో అజిత్ తల్లి మరణించడంతో అతడిని పరామర్శించడానికి త్రిషతో కలిసి దళపతి విజయ్ రావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
అజిత్ ను పరామర్శించడానికి విజయ్ తో కలిసి త్రిష వెళ్లడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత ట్రిప్ లకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేశారు. ఈ ట్రోల్స్ కు త్రిష తనదైన శైలిలో స్పందించారు. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన ఈ భామ.. ‘‘ నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను’’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. నేరుగా ఎవరి పేరును ఆమె ప్రస్తావించకపోయినప్పటికీ, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి కౌంటర్ గా ఈ పోస్ట్ పెట్టారని అభిమానులు భావిస్తున్నారు.
అంతేకాదు, మే నెల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కూడా త్రిష మ్యాజికల్ మే పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా తన ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు. మే నెలలో త్రిష పుట్టిన రోజు ఉండటమే కాదు, తన ఆప్తమిత్రుడు విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి, సీఎం అయ్యారు. దీనికి తోడు ఆమె నటించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. ఈ వరుస విజయాలతోనే ఆమె ఈ పోస్ట్ పెట్టారని సమాచారం.

