
ఆఫ్ఘనిస్థాన్పై భారత్ చారిత్రక విజయం సాధించింది.ఏకైక టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో 8 వికెట్లకు 564 పరుగుల భారీ స్కోరు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ఘనిస్థాన్ కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తా చాటగా.. ఆఫ్ఘన్ ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్, కేవలం 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది.భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (4 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు) ఆఫ్ఘన్ పతనాన్ని శాసించారు.

