
అమెరికాలో ప్రతిష్టాత్మక తెలుగు సంస్థ ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించబోయే 19వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్కు రంగం సిద్ధమవుతోంది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా నేతృత్వంలో ఈ ఏడాది జులై 31, ఆగస్టు 1, 2 తేదీలలో మేరీల్యాండ్లోని ప్రసిద్ధ ‘బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్’ వేదికగా ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ మహాసభల ముందస్తు వేడుకల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఆటా కమిటీ విస్తృతంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రవాసాంధ్రుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇందులో భాగంగానే, వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ‘ఝుమ్మంది నాదం’ సంగీత విభావరి అత్యంత విజయవంతంగా ముగిసింది. సుధా కొండపు నేతృత్వంలో ఆటా ఝుమ్మంది నాదం కార్యక్రమం సాగింది.

