Find Articles

మరో వివాదంలో ‘పెద్ది’.! చిత్ర యూనిట్ కు బిగ్ షాక్

మరో వివాదంలో ‘పెద్ది’.!  చిత్ర యూనిట్ కు బిగ్ షాక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ మరో వివాదంలో చిక్కుకుంది.ఇప్పటికే హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను తెరపై చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా ఆదివాసీ సంఘాల ఫిర్యాదుతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు, ఉపయోగించిన పదాలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానంపై సరైన అవగాహన లేకుండా తెరకెక్కించారని విమర్శిస్తున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఆదివాసీ సంఘాలు విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశాయి. సినిమాలో దాదాపు 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తో పాటు సెన్సార్ బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.దీంతో ఈ వ్యవహరం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ManaTV Team