
మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…బురదజల్లి పారిపోతే మౌనంగా తుడుచుకుపోయే రకం కాదు మంత్రి లోకేష్. బురద జల్లినవాడి మెడలు వంచి వాడితోనే కడిగించే రకం. అందుకే మెగా డిఎస్సీ 2025 పై జగన్ చేసిన ఆరోపణలపై “చర్చించుదాం రా!” అంటూ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి సమీపంలో నిలబడి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సవాల్ ను స్వీకరించే ధైర్యం జగన్ కు ఉందా ? బయటకు వచ్చి చర్చ చేసే దమ్ముందా .. అని లోకేష్ వ్యాఖ్యానించారు.

