NEET పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలపై ఉద్యమం చేపట్టేందుకు ఏర్పాటైన **కాక్రోచ్ జనతా పార్టీ (CJP)**లో అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి. CJP పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మనీష్ బ్రహ్మభట్, ‘CJP-Democratic’ పేరుతో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు.
CJP తన అసలు లక్ష్యాల నుంచి పక్కదారి పట్టి రాజకీయ ప్రభావానికి లోనైందని బ్రహ్మభట్ ఆరోపించారు. సంస్థ ప్రస్తుతం ‘టీమ్ కేజ్రీవాల్’గా మారిపోయిందని ఆయన విమర్శించారు. కొత్త బృందంలో ఆమ్ ఆద్మీ పార్టీతో అనుబంధం ఉన్న ఎనిమిది మందికి చోటు కల్పించారని, విద్యార్థులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆరోపించారు.
CJPపై మరిన్ని ఆరోపణలు చేస్తూ, సంస్థ పేపర్ లీక్ వ్యవహారాల్లో భాగస్వామిగా మారిందని బ్రహ్మభట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.