Find Articles

ఈ నెల 31 నుంచి ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మహాసభలు

ఈ నెల 31 నుంచి ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మహాసభలు

అమెరికాలోని తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చే ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ 19వ మహాసభలకు బాల్టిమోర్ నగరం సిద్ధమవుతోంది. వేలాది మంది ఎన్ఆర్ఐ ప్రముఖులు, తెలుగు వారు పాలుపంచుకోనున్న ఈ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్ష జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది.. ఈ మేరకు ఆటా కార్యవర్గం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ బాల్టిమోర్ కన్వెన్షన్‌లో బిజినెస్ సెమినార్లు హైలైట్‌గా నిలవనున్నాయి. దిగ్గజ వ్యాపారులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్ ఫౌండర్ల సమక్షంలో B2B మ్యాచ్ మేకింగ్, ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్కింగ్ సెషన్స్ నిర్వహించనున్నారు. జీ టీవీ 5 సహకారంతో ‘ఐడియా బాజ్’ వంటి వినూత్న కార్యక్రమాలు ఔత్సాహికులకు గొప్ప అవకాశంగా మారనున్నాయని తెలుస్తోంది. అలాగే మెడికల్ కాన్ఫరెన్స్‌లో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, హృద్రోగ, డయాబెటిస్, క్యాన్సర్ రీసెర్చ్‌పై నిపుణులు కీలక చర్చలు జరపనున్నారు.

అంతేకాదు ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా నిర్వహించే శ్రీ శివ పార్వతుల కళ్యాణం ఈ సభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిరావాల్ బ్యాండ్ లైవ్ కాన్సర్ట్, ఆటా బ్యూటీ పేజెంట్, లిటరరీ కాన్ఫరెన్సెస్, యూత్ క్రూయిజ్, ఫ్యాషన్ షో, అష్టావధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.

1991లో స్థాపించబడిన ఆటా సంస్థ.. గత 35 ఏళ్లుగా ఎన్ఆర్ఐల కోసం ఎన్నో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలవడమే కాకుండా, మాతృభూమిలో వరదలు, కోవిడ్ వంటి విపత్తుల సమయంలో ‘ఆటా ఫౌండేషన్’ ఎనలేని వైద్య, విద్యా సేవలు అందించింది.

ManaTV Team